13 Years బాలుడు అవయవదానం.. ఐదుగురికి ఊపిరి..

ABN , First Publish Date - 2021-07-23T16:45:49+05:30 IST

పదమూడేళ్ల బాలుడి అవయవదానం ఐదుగురికి ఊపిరి పోసింది.

13 Years బాలుడు అవయవదానం.. ఐదుగురికి ఊపిరి..

  • చిరంజీవి సిద్దార్థ..


హైదరాబాద్‌ సిటీ : పదమూడేళ్ల బాలుడి అవయవదానం ఐదుగురికి ఊపిరి పోసింది. భద్రాచలం పరిధి కొత్తకాలనీ అశోక్‌నగర్‌కు చెందిన కొయ్యల సిద్దార్థ (13)కు ఈ నెల 17న అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు వచ్చాయి. అతడిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర వైద్యం అందించినప్పటికీ బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 48 గంటల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. అతనికి ‘హైపెక్స్‌ బ్రెయిన్‌ ఇన్‌జురీ’గా గుర్తించిన వైద్యులు బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 21న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ సభ్యులు అవయవదానంపై తల్లి సీతకు అవగాహన కల్పించడంతో ఆమె అంగీకరించారు. దీంతో బాలుడి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు సేకరించి ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురికి అమర్చారు.

Updated Date - 2021-07-23T16:45:49+05:30 IST