యూఏఈలో కొవిడ్ ఉధృతి.. 1.30 లక్షల మార్కును దాటిన కేసులు !

ABN , First Publish Date - 2020-10-30T13:21:46+05:30 IST

యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.

యూఏఈలో కొవిడ్ ఉధృతి.. 1.30 లక్షల మార్కును దాటిన కేసులు !

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.30 లక్షల మార్కును దాటింది. గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 1,30,573 కొవిడ్ టెస్టుల్లో 1,312 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 1,30,336కు చేరింది. అలాగే నిన్న 1,500 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,26,147కు చేరాయి. ఇక గురువారం సంభవించిన మూడు కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారికి బలైన వారు 488 మంది అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, యూఏఈలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల లోపు నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 12.9 మిలియన్ల టెస్టులు పూర్తి చేసింది.   

Updated Date - 2020-10-30T13:21:46+05:30 IST