ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-18T23:35:00+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్

ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,75,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,478 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,705 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,59,500 మంది రికవరీ చెందారు. 

Updated Date - 2021-12-18T23:35:00+05:30 IST