ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-18T23:35:00+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,75,683 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,478 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,59,500 మంది రికవరీ చెందారు.