కర్ణాటకలో కొత్తగా 138 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-22T23:24:40+05:30 IST
కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే 138 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే 138 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 138 కరోనా కేసులు నమోదుకాగా, మరణాలేమీ సంభవించలేదు. అయితే 26 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య 1,743కు చేరింది. 41 మంది మరణించారు. ఇప్పటివరకు 597 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ,1,104 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.