138 మంది భారతీయులను.. నౌక నుంచి బయటకు తీసుకురావడం కుదరదు

ABN , First Publish Date - 2020-02-14T16:03:05+05:30 IST

డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు.

138 మంది భారతీయులను.. నౌక నుంచి బయటకు తీసుకురావడం కుదరదు

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు. కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్ ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించిందని, ఈ నౌకలో 3,711 మంది ఉన్నారని, వారిలో 138 మంది భారతీయులని మంత్రి చెప్పారు.


డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొవిడ్-19 వైరస్ నివారణకు కావాల్సిన అదనపు ఔషధాలను రెండు మూడు నెలల్లో రప్పిస్తామని మంత్రి వివరించారు.

Updated Date - 2020-02-14T16:03:05+05:30 IST