138 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-29T05:18:42+05:30 IST

గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను లంకెలపాలెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు.

138 కిలోల గంజాయి స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

లంకెలపాలెం, జనవరి 28: గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను లంకెలపాలెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. వీరి నుంచి 138 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లతో పాటు ఓ కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి మండలానికి చెందిన సలాది రమేశ్‌, నక్కరాజు సతీశ్‌తో పాటు పెదబయలు మండలానికి చెందిన వర్రా వెంకటేశ్‌లు గంజాయిని తరలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు ఎన్‌.గణేశ్‌, పి .అప్పలరాజు, ఎస్‌ఐ అమనరావులు తమ సిబ్బందితో లంకెలపాలెం వద్ద కాపు కాశారు. ముఠా సభ్యులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 138 గంజాయి ప్యాకెట్లు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గాజువాక ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.


Updated Date - 2022-01-29T05:18:42+05:30 IST