ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-18T00:59:09+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 8 మంది మరణించారు. ఏపీలో మొత్తం 20,36,179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 14,052 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 14,797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకు 20,07,330 మంది రికవరీ చెందారు.