ఆ ఓవరే అంతా మార్చేసింది.. ఢిల్లీ ఓటమిపై మాజీ ప్లేయర్

ABN , First Publish Date - 2021-04-17T11:45:37+05:30 IST

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందించాడు. ఆ మ్యాచ్ మొత్తాన్ని ఒక్క ఓవర్ మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్య ఓవర్లలో పంత్ డిఫెన్సివ్ అయిపోయాడని చెప్పిన అజయ్ జడేజా..

ఆ ఓవరే అంతా మార్చేసింది.. ఢిల్లీ ఓటమిపై మాజీ ప్లేయర్

ముంబై: తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందించాడు. ఆ మ్యాచ్ మొత్తాన్ని ఒక్క ఓవర్ మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్య ఓవర్లలో పంత్ డిఫెన్సివ్ అయిపోయాడని చెప్పిన అజయ్ జడేజా.. మార్కస్ స్టొయినిస్ వేసిన 13వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. రాజస్థాన్‌ చేజింగ్ ఆ ఓవర్‌తోనే ప్రారంభమైందని తెలిపాడు. అదే సమయంలో కగిసో రబాడ, అవేష్ ఖాన్, క్రిస్ వోక్స్, అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితి వేరేలా ఉందని, స్టొయినిస్ బౌలింగ్ చేయడంతో పరిస్థితి తలకిందులైందని ఈ మాజీ ఆటగాడు వివరించాడు. స్టొయినిస్, కర్రాన్‌లకు బౌలింగ్ ఇవ్వడం ద్వారా రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలను ఢిల్లీనే చేజేతులా ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2021-04-17T11:45:37+05:30 IST