14 మంది రౌడీల అరెస్టు
ABN , First Publish Date - 2021-02-26T12:55:49+05:30 IST
శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 14 మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనకు పాల్పడేవారు, పాత నేరస్తులను అరెస్టు ..
చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 14 మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనకు పాల్పడేవారు, పాత నేరస్తులను అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ ఉత్వర్వులు జారీ చేసింది. ఈసీ ఉత్తర్వులతో జిల్లాలో తొలివిడతగా గురువారం 14 మంది రౌడీలను అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రౌడీలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పరారయ్యారు. రౌడీలను అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.