14ఏళ్ల అమ్మాయి.. స్కూల్ నుంచి వచ్చి సరాసరి తన గదిలోకి వెళ్లింది.. తర్వాత ఆమె చేసిన పనికి..

ABN , First Publish Date - 2021-12-12T18:06:58+05:30 IST

ఆ అమ్మాయికి 14ఏళ్లు. బంధువుల ఇంటి దగ్గర ఉండి.. స్థానికంగా ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్‌కు వెళ్లిన ఆమె.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చింది. సరాసరి తన గదిలోకి వెళ్లిపోయిం

14ఏళ్ల అమ్మాయి.. స్కూల్ నుంచి వచ్చి సరాసరి తన గదిలోకి వెళ్లింది.. తర్వాత ఆమె చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ అమ్మాయికి 14ఏళ్లు. బంధువుల ఇంటి దగ్గర ఉండి.. స్థానికంగా ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్‌కు వెళ్లిన ఆమె.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చింది. సరాసరి తన గదిలోకి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది సమయానికి.. ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల మీనాక్షీ.. తన బంధువైన చందన్ సింగ్ ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. రోజూ చందన్ సింగ్ కొడుకుతో కలిసి స్కూల్‌కు వెళ్లేది. ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్‌కు వెళ్లింది. పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం 3 గంటలకు ఇంటికి చేరుకుంది. సరాసరి తన గదిలోకి వెళ్లిపోయింది. కొద్ది సమయం తర్వాత చందన్ సింగ్ భార్య మీనాక్షి కోసం తన గదికి వెళ్లింది. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. ఉరేసుకుని మీనాక్షి వేలాడటం చూసి.. గట్టిగా కేకలు పెట్టింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకుని.. మీనాక్షిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి.. మీనాక్షి చనిపోయినట్టు స్పష్టం చేశారు. దీంతో మీనాక్షి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మీనాక్షి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. 




Updated Date - 2021-12-12T18:06:58+05:30 IST