కూరగాయలకని వెళ్లి యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-06-07T12:07:02+05:30 IST

జూన్‌ 4న కూరగాయలకని వెళ్లి ఇంటికి రాలేదు.

కూరగాయలకని వెళ్లి యువతి అదృశ్యం

హైదరాబాద్‌ సిటీ/ఆనంద్‌బాగ్‌ : మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయింది. హనుమాన్‌ పేట్‌లో నివాసం ఉండే పద్మబాల మణి కుమార్తె అశ్వని(19) జూన్‌ 4న కూరగాయలకని వెళ్లి ఇంటికి రాలేదు. అందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె కోసం తెలిసిన చోట వెదికినా ఆచూకీ లభించలేదు. పద్మబాల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-07T12:07:02+05:30 IST