ఉమ్మడి జిల్లాలో 1,462 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-04-21T06:16:05+05:30 IST
కరోనా వ్యాప్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇరు జిల్లాల్లో మంగళవారం 1,462పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగూడెం కలెక్టరేట్, ఏప్రిల్ 20: కరోనా వ్యాప్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇరు జిల్లాల్లో మంగళవారం 1,462పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,450మందికి పరీక్షలు నిర్వహించగా 1,050మందికి పాజిటివ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5,110మందికి పరీక్షలు నిర్వహించగా 412 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ జిల్లాలో మంగళవారం 4,750మందికి వ్యాక్సిన్ టార్గెట్ కాగా కేవలం 1848మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు.