కర్ణాటకలో తగ్గని కరోనా ప్రభావం.. గత 24 గంటల్లో..
ABN , First Publish Date - 2020-07-08T04:37:42+05:30 IST
కర్ణాటకలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్ణాటకలో...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్ణాటకలో కొత్తగా 1,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు, కరోనా వల్ల కొత్తగా 15 మంది కర్ణాటకలో మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,815కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 416కు చేరింది. కర్ణాటకలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,297.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు కేంద్ర బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించింది. సీఎంతో ఈ బృందం భేటీ అయింది. కర్ణాటకలో కరోనా కట్టడికి సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నామని, సామాజిక వ్యాప్తి కర్ణాటకలో లేదని సీఎం యడియూరప్ప కేంద్ర బృందానికి స్పష్టం చేశారు.