వీసాల కోసం తొక్కిసలాట.. 15మంది మృతి

ABN , First Publish Date - 2020-10-22T08:20:17+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం జారీ చేసే వీసాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని సుమారు 15మంది మృతి చెందారు...

వీసాల కోసం తొక్కిసలాట.. 15మంది మృతి

కాబూల్‌, అక్టోబరు 21: అఫ్ఘానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం జారీ చేసే వీసాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని సుమారు 15మంది మృతి చెందారు. ప్రతి ఏటా పాక్‌ జారీ చేసే వీసాలకు అఫ్ఘాన్‌లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్వహించిన వీసా మేళాకు సుమారు 3వేలమంది అఫ్ఘాన్లు హాజరయ్యారు. జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో జనాల్లో పెరిగిన అసహనం, తొక్కిసలాటకు దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా.. ఈ ఘటన పట్ల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-22T08:20:17+05:30 IST