రెండు రోజుల్లో 15 కిలోల బియ్యం!
ABN , First Publish Date - 2020-03-30T09:30:52+05:30 IST
రెండు రోజుల్లో ప్రతి మనిషికీ 15 కిలోల బియ్యం ఇస్తాం. రూ.1500 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. బియ్యం ఊర్లో చేతికి ఇస్తాం. అందుకే
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల్లో ప్రతి మనిషికీ 15 కిలోల బియ్యం ఇస్తాం. రూ.1500 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. బియ్యం ఊర్లో చేతికి ఇస్తాం. అందుకే బియ్యం వాహనాలను గ్రామాల్లోకి రానివ్వాలి. నిత్యవసర వస్తువులు రావాల్సి ఉంటుంది. వాహనాలను అడ్డుకోవద్దు. గతంలో కర్వ్యూ అంటే మంగళ్హాట్లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్, రాష్ట్రం, దేశం, ప్రపంచమంతటా కర్ఫ్యూ ఉంది. భవిష్యత్లో ఇలాంటి భయానక పరిస్థితి రావొద్దని దేవుణ్ని కొరుకోవాలి.