ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన కజిన్

ABN , First Publish Date - 2021-10-16T22:48:26+05:30 IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వరుసకు సోదరుడైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన కజిన్

న్యూఢిల్లీ: ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలికపై వరుసకు సోదరుడైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. కోట్లా ముబారక్‌పూర్‌లోని బాపు పార్క్‌లో బాధిత బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆమె తల్లి ఉత్తరప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. బాలికకు వరుసకు అన్నయ్య అయ్యే యువకుడు సమీపంలోనే నివసిస్తుంటాడు.


ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న అతడు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికీ చెప్పొద్దని, బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.  తల్లి తిరిగి వచ్చిన తర్వాత బాలిక రోదిస్తూ జరిగిన  ఘోరాన్ని చెప్పింది. దీంతో వారు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.  

Updated Date - 2021-10-16T22:48:26+05:30 IST