ఏపీలో కొత్తగా 1,501 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-08-19T23:04:48+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల

ఏపీలో కొత్తగా 1,501 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1,501 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. తాజాగా కరోనాతో 10 మంది మరణించారు. ఏపీలో మొత్తం 19,98,603 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో మొత్తం 13,696 మరణాలు సంభవించాయి. ఏపీలో 15,738 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 19,69,169 మంది రికవరీ చెందారు. గత 24 గంటల్లో 67,716 శాంపిల్స్‌‌ను సేకరించారు. కరోనా నుంచి 1,697 మంది రికవరీ చెందారు. కరోనాతో కృష్ణాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరులో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కరోనాతో విశాఖలో ఒకరు చనిపోయారు. 

Updated Date - 2021-08-19T23:04:48+05:30 IST