ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-02T23:32:27+05:30 IST

ఏపీలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. సెకెండ్ వేవ్‌ను రాష్ట్రాన్ని వణికించింది. ఇప్పుడు కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. సెకెండ్ వేవ్‌ను రాష్ట్రాన్ని వణికించింది. ఇప్పుడు కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,546 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 19,70,008కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  15 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,410 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి ఇప్పటవరకు 19,36,016 రికవరీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో 59,641 శాంపిల్స్‌ సేకరించారు.


Updated Date - 2021-08-02T23:32:27+05:30 IST