16 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-26T18:22:11+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 16మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 3674మందికి పరీక్షలు నిర్వహించగా 11, భద్రాద్రి మొత్తం 821మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రధాన
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 16మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 3674మందికి పరీక్షలు నిర్వహించగా 11, భద్రాద్రి మొత్తం 821మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో సోమవారం నలుగురు చేరగా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మృతిచెందారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 18 మంది చికిత్స పొందుతుండగా.. 302 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.