ఏపీకి 16 పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్

ABN , First Publish Date - 2022-01-25T23:41:55+05:30 IST

ఏపీకి 16 పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్ లభించాయి. రిపబ్లిక్ డే

ఏపీకి 16 పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్

ఢిల్లీ: ఏపీకి 16 పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్ లభించాయి. రిపబ్లిక్ డే పురస్కరించుకొని పోలీస్ మెడల్స్‌ను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్(పీపీఎం) వచ్చింది. పోలీస్ శాఖలో తన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ మెడల్ ప్రకటించింది. ఏపీలో మొత్తం 15 మందికి  పోలీస్ మెడల్స్(పీఎం) లభించాయి. మెరిటోరియస్ సేవలను గుర్తిస్తూ పీఎం పతకాలకు ఎంపిక చేశారు.


 ఎస్.వి రాజశేఖర్ బాబు (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ లా&ఆర్డర్), ఎం.రవీంద్రనాధ్ బాబు, సూపరిండింట్ంట్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్ గోదావరి కాకినాడ), శ్రీ రాంబాబు, డిప్యూటీ సూపరిండింట్ంట్ ఆఫ్ పోలీస్ (నెల్లూరు), విజయ్ పాల్ కైలే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్ జోన్ విజయవాడ), విజయ్ కుమార్ బులా, అసిస్టెంట్ కమాండెంట్ గ్రేహౌండ్స్, (విశాఖపట్నం) సుబ్రహ్మణ్యం కొలగాని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ , (విశాఖపట్నం) లు పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. 

Updated Date - 2022-01-25T23:41:55+05:30 IST