16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2020-09-22T08:27:13+05:30 IST

ఎగువన ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి సాగర్‌ నీటిమట్టం 589.50(310.55 టీఎంసీలు) అడుగులు ఉంది. కుడి కాలువ ద్వా

16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 21: ఎగువన ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి సాగర్‌ నీటిమట్టం 589.50(310.55 టీఎంసీలు) అడుగులు ఉంది. 


కుడి కాలువ ద్వారా 8,604 క్యూసెక్కులు, 16 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,38,624, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, ఎడమ కాలువ ద్వారా 3,977, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,110, మొత్తం 2,82,110 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,82,110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40(211.95 టీఎంసీలు) అడుగులుంది.

Updated Date - 2020-09-22T08:27:13+05:30 IST