డ్రంకన్డ్రైవ్లో 1,670 ఛార్జ్ షీట్లు దాఖలు
ABN , First Publish Date - 2021-08-22T00:07:21+05:30 IST
నగరంలో ట్రాఫిక్ పోలీసులలు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు. జులై, ఆగస్ట్లో డ్రంకన్ డ్రైవ్ చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇప్పటివరకు 2,056 మంది వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు. వాహనదారులపై 1670 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. నాంపల్లి 3, 4 వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన వారినుంచి 1,74,50,100/ చలాన్లు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 386 మందిపై చార్జ్షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు.