పాపం.. చెప్పు కోసం వెళ్లి మృత్యువాత

ABN , First Publish Date - 2021-12-17T15:04:21+05:30 IST

వెంటనే అతన్ని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించిగా...

పాపం.. చెప్పు కోసం వెళ్లి మృత్యువాత

హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : మొదటి అంతస్తు రేకుల షెడ్డు పైన పడిన చెప్పును తీసుకునే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. హయత్‌నగర్‌ పరిధి శాంతినగర్‌లో ఉన్న ఓ భవనంలోని రెండో అంతస్తులో రాహుల్‌ (18) అద్దెకుంటున్నాడు. గురువారం ఉదయం అతని స్లిప్పర్‌ (చెప్పు) మొదటి అంతస్తు రేకుల షెడ్డుపై పడిడంతో ఇనుప రాడ్డుతో చెప్పును తీసేందుకు ప్రయత్నించాడు. పైభాగంలో ఉన్న11 కేవీ వైరుకు ఆ రాడ్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై రాహుల్‌ కింద పడిపోయాడు. వెంటనే అతన్ని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-17T15:04:21+05:30 IST