185 పాజిటివ్‌లు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-08-04T05:59:52+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా 185 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

185 పాజిటివ్‌లు.. ఒకరు మృతి

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 3 : జిల్లాలో మంగళవారం కొత్తగా 185 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 41, ఒంగోలు రూరల్‌లో 23, కొత్తపట్నంలో 15,ఎస్‌ఎన్‌పాడులో 11,టంగుటూరులో 10 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అలాగే జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ కేసులు వచ్చాయి. కొత్తపట్నంకు చెందిన ఒకరు మృతిచెందారు. ఇదిలా ఉండగా,మంగళవారం కొత్తగా రెండు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫంగస్‌ బాధితుల సంఖ్య 237కు పెరిగింది.


జిల్లాలో 6,048మందికి టీకాలు  

ఒంగోలు(కలెక్టరేట్‌ ), ఆగస్టు 3: జిల్లాలో మంగళవారం 6,048 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రత్నావళి తెలిపారు. జిల్లాలో 130 కేంద్రాల్లో వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 15,71,904 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.




Updated Date - 2021-08-04T05:59:52+05:30 IST