ఎయిమ్స్ ఆస్పత్రిలో 195 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2020-05-28T22:22:39+05:30 IST

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఇప్పటి వరకు 195 మంది ఆరోగ్య సిబ్బంది ...

ఎయిమ్స్ ఆస్పత్రిలో 195 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా

న్యూఢిల్లీ: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఇప్పటి వరకు 195 మంది ఆరోగ్య సిబ్బంది కొవిడ్-19 బారిన పడినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజుల్లోనే 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించగా.. ఇందులో ఓ ఎంబీబీఎస్ విద్యార్ధి, ముగ్గురు రెసిడెంట్ డాక్టర్లు, ఎనిమిది మంది నర్సులు, ఐదుగురు మెస్ వర్కర్లు ఉన్నట్టు తెలిసింది. ఇంకా మిగతా వారిలో ల్యాబొరేటరీ స్టాఫ్, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరు ఎవరెవరిని కలుసుకున్నారన్న దానిపై ప్రస్తుత అధికారులు ఆరా తీస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా బారిన పడిన మొత్తం 195 మంది ఎయిమ్స్ సిబ్బందిలో.. ఇప్పటికే చాలామంది కోలుకుని, తిరిగి విధుల్లో చేరారు. కాగా ఇటీవల కోవిడ్ 19 బారిన పడిన ఎయిమ్స్ శానిటైజేషన్ సూపర్‌వైజర్ ఒకరు ఆదివారం మృతి చెందగా... ఎయిమ్స్ మెస్ వర్కర్ పనిచేస్తున్న మర గత వారంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-05-28T22:22:39+05:30 IST