సీఎం దృష్టికి తీసుకెళ్లండి.. సబితను కోరిన 1998 డీఎస్సీ సాధన సమితి

ABN , First Publish Date - 2021-07-13T19:41:44+05:30 IST

నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ పిటిషన్ దారులు అందరికీ త్వరగా ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.

సీఎం దృష్టికి తీసుకెళ్లండి.. సబితను కోరిన 1998 డీఎస్సీ సాధన సమితి

హైదరాబాద్: నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ పిటిషన్ దారులు అందరికీ త్వరగా ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ సాధన సమితి డిమాండ్ చేసింది. మంగళవారం నాటి కేబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అభ్యర్థిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. 

Updated Date - 2021-07-13T19:41:44+05:30 IST