ముగిసిన 2రోజుల ‘తెలుగుదేశం మహానాడు’

ABN , First Publish Date - 2020-05-29T01:02:54+05:30 IST

2రోజుల తెలుగుదేశం మహానాడు ముగిసింది. టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు. 2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు. దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే

ముగిసిన 2రోజుల ‘తెలుగుదేశం మహానాడు’

అమరావతి: 2రోజుల ‘తెలుగుదేశం మహానాడు’ ముగిసింది. టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు. 2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు. దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చైనాతో తాజా పరిస్థితులు దృష్ట్యా కేంద్రానికి సహకారం ఉంటుందని తెలుపుతూ తీర్మానం చేసి పంపుతామని చెప్పారు. సీఎం జగన్‌ చేసేది ఒక విధ్వంస పాలన అంటూ మండిపడ్డారు. యువతని ప్రోత్సహిస్తామని, మహిళలకు ప్రాధాన్యమిస్తామని బాబు ప్రకటించారు. ఏపీలో ఒక ఆటవిక రాజ్యాన్ని తీసుకువచ్చారని, ప్రజాస్వామ్యాన్ని అందరూ కలిసి కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-29T01:02:54+05:30 IST