అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

ABN , First Publish Date - 2021-03-15T14:04:49+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ పార్టీలో గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 15 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వె

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ పార్టీలో గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 15 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో‌లో ఓ కంపెనీ ఆవరణలో పార్టీ జరుగుతుండగా కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..  సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోసుకున్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు తుపాకులను గుర్తించినట్టు చెప్పారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు? కాల్పులకు తెగబడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. టెక్సాస్‌లోని హ్యూస్టన్ నగరంలో కూడా ఇటీవల కాల్పులు చోటు చేసుకున్నాయి. గత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-03-15T14:04:49+05:30 IST