మణిపూర్ను వణికించిన వరుస భూకంపాలు... ఈశాన్య భారతమంతటా..
ABN , First Publish Date - 2020-05-26T03:32:56+05:30 IST
13 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు చోటుచేసుకున్న వరుస భూకంపాలు మణిపూర్ని వణికించాయి...
ఇంఫాల్: 13 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు చోటుచేసుకున్న వరుస భూకంపాలు మణిపూర్ వాసులను వణికించాయి. వీటి తాలూకు ప్రకంపనలు దాదాపు ఈశాన్య భారతమంతటా వ్యాపించాయి. గువాహటి సహా అసోంలోని పలు ప్రాంతాలతో పాటు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవాళ సాయంత్రం 8.2 గంటలకు మణిపూర్లో తొలిసారి భూకంపం సంభవించగా... రిక్టార్ స్కేలుపై దీని తీవ్రం 5.5గా నమోదైనట్టు సిస్మాలజీ జాతీయ కేంద్రం వెల్లడించింది. ఇది జరిగిన కొద్ది సేపటికే 8.25కి మరోసారి భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 2.9గా నమోదైంది.