డ్రగ్స్ కేసులో ఇద్దరు భారతీయులకు 34 ఏళ్ల జైలుశిక్ష

ABN , First Publish Date - 2020-05-29T01:27:48+05:30 IST

అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు యూకేలో

డ్రగ్స్ కేసులో ఇద్దరు భారతీయులకు 34 ఏళ్ల జైలుశిక్ష

లండన్: అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు యూకేలో 34 ఏళ్ల జైలుశిక్ష పడింది. శక్తి గుప్తా(34), బాల్దేవ్ సింగ్(54) ఇద్దరూ 172 కేజీల కొకైన్‌ను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది డిసెంబరు 11న బాల్దేవ్ సింగ్ డ్రగ్స్ ఉన్న వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ సమయంలో వాహనంలో మొత్తంగా 168 కేజీల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల్దేవ్ సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆల్డ్స్ ట్రేడింగ్ ఎస్టేట్ పార్క్‌లో రెండో రైడ్ జరపగా మరో నాలుగు కేజీల కొకైన్ దొరికింది. ఈ రైడ్‌లో పోలీసులు శక్తి గుప్తాను అరెస్ట్ చేశారు. యూకేలో ఇంత మొత్తంలో డ్రగ్స్‌ దొరకడం ఇదే మొదటిసారి అని డిటెక్టివ్ సూపర్ఇంటెండెంట్ నీల్ బల్లార్డ్ తెలిపారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతూ రాగా.. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. శక్తి గుప్తాకు 18 ఏళ్లు.. బాల్దేవ్ సింగ్‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పిచ్చారు. కాగా.. యూకేలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఎవరు ప్రయత్నించినా ఇదే విధంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-05-29T01:27:48+05:30 IST