రాజౌరీలో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు వీరమరణం
ABN , First Publish Date - 2021-10-31T02:07:53+05:30 IST
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఎల్ఓసీకి సమీపంలో మందుపాతర పేలి ఇద్దరు భారత జవాన్లు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఎల్ఓసీకి సమీపంలో మందుపాతర పేలి ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒక ఆఫీసరు కూడా ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరి జిల్లా నౌషెరా తహసిల్లోని ఎల్ఓసీ కలాల్ ప్రాంతంలో రోజువారీ గస్తీ తిరుగుతుండగా శనివారంనాడు మందుపాతర పేలినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. చొరబాటు యత్నాలను తిప్పికొట్టేందుకు ఆర్మీ ఈ ప్రాంతంలో మందుపాతర ఏర్పాటు చేసిట్టు అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ తెలిపింది.