భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు... అమరులైన ఇద్దరు జవాన్లు

ABN , First Publish Date - 2020-11-26T21:45:00+05:30 IST

శ్రీనగర్ లోని హెచ్‌ఎంటీ ప్రాంతంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ‘క్విక్ రియాక్షన్’ టీమ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు

భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు... అమరులైన ఇద్దరు జవాన్లు

శ్రీనగర్ : శ్రీనగర్ లోని హెచ్‌ఎంటీ ప్రాంతంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ‘క్విక్ రియాక్షన్’ టీమ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. క్విక్ రియాక్షన్ టీమ్ లోని ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు హెచ్‌ఎంటీ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి, పౌర నష్టం ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సమాధానమిచ్చాయి. జైషేమహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని, వారిని పట్టుకోడానికి ప్రయత్నిస్తామని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు కారులోంచే భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు ఐజీ విజయ కుమార్ తెలిపారు. 

Updated Date - 2020-11-26T21:45:00+05:30 IST