Trampled to Death: ఇద్దర్ని తొక్కిచంపిన గజరాజులు
ABN , First Publish Date - 2022-08-25T00:11:57+05:30 IST
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మొరొదా బ్లాక్లో ఏనుగులు స్వైరవిహారం..
బరిపద: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మొరొదా బ్లాక్లో ఏనుగులు (Elephants) స్వైరవిహారం చేశాయి. ఇద్దరు వ్యక్తులను తొక్కిచంపాయి (Trampled to Death). రెండు వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. దంగర్సాహి గ్రామంలో మొదటి ఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రపోతున్న ఓ 40 ఏళ్ల యువకుడిని ఏనుగులు తొక్కిచంపాయి.
కాగా, మరో సంఘటన సాంగడి ఫారెస్ట్లో జరిగింది. 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. తప్పిపోయిన గోవును వెతికేందుకు అడవిలోకి అతను వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఘన్శ్యామ్ సింగ్ తెలిపారు. కాగా, రెండు మృతదేహాలను పోస్ట్ మార్గం కోసం పీఆర్ఎం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.