20 కుటుంబాలు టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2022-01-20T04:41:44+05:30 IST
మదిరేపల్లె వైసీపీకి చెందిన 20 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి.
దువ్వూరు, జనవరి 19: మదిరేపల్లె వైసీపీకి చెందిన 20 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్యాదవ్ సమక్షంలో మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, నారపురెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురప్ప, వారి అనుచరులు పుట్టా స్వగృహంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్యాదవ్ను వారు సత్కరించారు.
పుట్టా పరామర్శ
ఇటీవల విద్యుదాఘాతానికి గురై గాయపడిన యువకుడు, సిబయ నపల్లె వాసి శివకుమార్ను మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్యాదవ్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.దువ్వూరు మండల టీడీపీ కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ హుస్సేన్సాహెబ్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
మైదుకూరులో....
మైదుకూరు రూరల్, జనవరి 19: టీడీపీ నేతలు హుసేన్పీరాను మంగళవారం టీటీడీ మాజీచైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరామర్శించారు. కొంత కాలంగా న్యూరాలజీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చికిత్స చేయించుకుని ఇటీవల ఇంటికి వచ్చి న ఆయనను పుట్టా విచారించారు. టీడీపీ మండలాధ్యక్షుడు బీమ య్య, శీర్ల నాగమోహన్ తదితరులున్నారు.