కొనసాగుతున్న 20 పునరావాస, 3 క్వారంటైన్ కేంద్రాలు
ABN , First Publish Date - 2020-05-23T10:30:10+05:30 IST
జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పునరావాస, మూడు క్వారంటైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్, మే 22: జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పునరావాస, మూడు క్వారంటైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తొలుత 28 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో బంగారుపాళ్యం, చిత్తూరు, కలకడ, ఐరాల, చంద్రగిరి, మదనపల్లెతోపాటు రేణిగుంటలోని రెండు కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన 20 కేంద్రాల్లో శుక్రవారానికి 1,020 మంది నిరాశ్రయులు ఉన్నారు. అలాగే మొదట 16 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13 మూతపడ్డాయి. మిగిలిన వాటిల్లో ఏర్పేడు మండలం వికృతమాల సెంటర్లో 512 మంది, వరదయ్యపాళ్యం ఏకం క్యాంపస్లో ఆరుగురు, తిరుపతి పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో 16 మంది ఉన్నారు.