Assemblyని నడపనున్న 200 మంది బాలలు...

ABN , First Publish Date - 2021-11-12T01:22:10+05:30 IST

బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజస్థాన్

Assemblyని నడపనున్న 200 మంది బాలలు...

జైపూర్ : బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజస్థాన్ శాసన సభ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం 200 మంది బాలలకు లభించింది. వీరిలో కొందరు స్పీకర్, ప్రతిపక్ష నేత, చీఫ్ విప్ వంటి పాత్రలను అభినయిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శాసన సభ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 


ఈ సమావేశంలో జీరో అవర్, క్వశ్చన్ అవర్ కూడా ఉంటాయి. విద్యార్థులు ప్రశ్నలు సంధించి, సమాధానాలను కోరుతారు. మన దేశంలో ఈ విధంగా ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్న తొలి శాసన సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ శాసన సభ స్పీకర్ సీపీ జోషీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా హాజరవుతారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 



Updated Date - 2021-11-12T01:22:10+05:30 IST