బ్రిటన్ ప్రధానికి భారత విద్యార్థుల వినతిపత్రం !
ABN , First Publish Date - 2020-09-25T12:03:42+05:30 IST
ఇంగ్లిషు భాషా పరీక్ష కుంభకోణంలో నిందితులైన దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఓ వినతిపత్రం సమర్పించారు.
మాకు న్యాయం చేయండి
బ్రిటన్ ప్రధానికి 200 మంది భారత విద్యార్థుల మొర
లండన్, సెప్టెంబరు 24: ఇంగ్లిషు భాషా పరీక్ష కుంభకోణంలో నిందితులైన దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఓ వినతిపత్రం సమర్పించారు. 2014లో జరిగిన ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్’(టీఓఈఐసీ)కు హాజరైన విద్యార్థుల్లో కొందరు తప్పుడు విధానాలకు పాల్ప డి- బ్రిటన్లోని విద్యాసంస్థలో చేరేందుకు, స్కాలర్షి్పలు పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణ. విషయం బయటపడడంతో వారందరినీ నిర్బంధకేంద్రాల్లో పడేశారు. దీంతో వారు జాన్సన్కు పిటిషన్ పెట్టుకున్నారు.