200 కేజీల గంజాయి దహనం
ABN , First Publish Date - 2021-10-26T06:11:05+05:30 IST
మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ సమారు 200 కేజీల గంజాయిని సోమవారం చీకురాయి చెరువు వద్ద పోలీసులు దహనం చేశారు.
- గంజాయి నివారణకు సహరించాలన్న డీఎస్పీ
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 25: మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ సమారు 200 కేజీల గంజాయిని సోమవారం చీకురాయి చెరువు వద్ద పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ మాట్లాడుతూ గంజాయి విక్రయించే, సేవించే వారి సమాచారం తెలిస్తే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటికే గంజాయి రవాణపై పోలీసులకు పూర్తి సమాచారం ఉందన్నారు. కొందరిని అదుపులోకి తీసుకొని పీడీయాక్ట్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేల్వై స్టేషన్, బస్టాండ్, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. యువలను గంజాయి బానిసలుగా మార్చే ఈ వ్యాపారానికి పూర్తి స్థాయిలో చెక్ పెడుతామ న్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలపై ప్రవర్తన శైలిపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి వ్యాపారంలో పట్టు బడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసే గంజాయి మహమ్మారిని తరిమి కొట్టేందుకు స్థానిక ప్రజలు సహకారం అందిచాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీలు సాదుల సారంగపాణి, గిరి ప్రసాద్, సీఐలు ప్రదీప్కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేష్, సిబ్బంది ఉన్నారు.