ఒకప్పటి కేబీసీ విజేత.. ఇప్పుడు ఐపీఎస్

ABN , First Publish Date - 2020-05-29T01:59:34+05:30 IST

20 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌‌లో కోటి రూపాయలు గెలిచాడు. ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా...

ఒకప్పటి కేబీసీ విజేత.. ఇప్పుడు ఐపీఎస్

గాంధీనగర్: 20 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌‌లో కోటి రూపాయలు గెలిచాడు. ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా దర్శనమిచ్చాడు. అతడే మోహన్ సైనీ. 2001లో జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌లో పాల్గొన్న పాల్గొన్న సైనీ మొత్తం 15 ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పి కోటి  రూపాయలు గెలుచుకున్నాడు. అప్పడు సైనీ వయసు 14 సంవత్సరాలు. సరిగ్గా రెండు దశాబ్దాల తరువాత ఇప్పడు ఐపీఎస్ అధికారి హోదాలో పోర్‌బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించాడు.


ఎంబీబీఎస్ చదివిన సైనీ ఇంటర్న్‌షిప్ చేస్తూనే యూపీఎస్‌సీ పరీక్షలు రాశాడు. అందులో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా సైనీ మాట్లాడుతూ, ‘మా నాన్న నేవీ అధికారి. ఆయనే నాకు ప్రేరణ. ఆయన స్ఫూర్తితోనే నేను ఐపీఎస్ అధికారిని అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-29T01:59:34+05:30 IST