‘2011 వరల్డ్కప్ ఫిక్సింగ్’ ఆరోపణలపై క్రిమినల్ విచారణ
ABN , First Publish Date - 2020-07-01T08:47:55+05:30 IST
2011 వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుబోయిందని ఆ దేశ మాజీ మంత్రి మహిందానంద అలుత్గమగె ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ...
ఆదేశించిన లంక ప్రభుత్వం
కొలంబో: 2011 వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుబోయిందని ఆ దేశ మాజీ మంత్రి మహిందానంద అలుత్గమగె ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై ఇప్పుడు లంక ప్రభుత్వం క్రిమినల్ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రువాన్చంద్ర చెప్పారు. 2011 వరల్డ్కప్ ఫైనల్లో లంకను ఓడించి భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.