ఉమ్మడి జిల్లాలో 207 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-17T05:47:13+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 207 కరోనా కేసులు

ఉమ్మడి జిల్లాలో 207 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 207 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 53 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. వికారాబాద్‌ జిల్లాలో 5 కేసులు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 118060కి చేరుకుంది.

షాద్‌నగర్‌ డివిజన్‌లో

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో శనివారం 154 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

వికారాబాద్‌ జిల్లాలో...

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/తాండూరు : వికారా బాద్‌ జిల్లాలో శనివారం ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. తాండూరులో 3, దౌల్తాబాద్‌, బంట్వారం మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.వీరు త్వరగా కోలుకోవాలని సాయిపూర్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  


Updated Date - 2021-01-17T05:47:13+05:30 IST