208 కరోనా కేసులు... నలుగురి మృతి
ABN , First Publish Date - 2021-09-05T06:04:32+05:30 IST
చిత్తూరు జిల్లాలో శుక్ర, శనివారం 208 మందికి కరోనా సోకినట్టు అధికారులు పేర్కొన్నారు.
తిరుపతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల వ్యవధిలో 208 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా ఆ వ్యవధిలోనే వైరస్ కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా నలుగురు మరణించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలతో జిల్లాలో కేసుల సంఖ్య 238953కు చేరుకోగా మరణాల సంఖ్య 1857కు పెరిగింది. శనివారం ఉదయానికి జిల్లాలో 2051 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి.తాజా పాజిటివ్ కేసులు తిరుపతిలో 48, చిత్తూరులో 16, తిరుపతి రూరల్లో 13, చంద్రగిరిలో 11, వాల్మీకిపురంలో 9, నాగలాపురంలో 8, పీలేరులో 7, శ్రీకాళహస్తి, సదుం మండలాల్లో 6 చొప్పున, పుంగనూరులో 5, గుడుపల్లె, కలికిరి, కుప్పం, కురబలకోట, ములకలచెరువు, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 4 వంతున, పలమనేరు, పుత్తూరు, బీఎన్ కండ్రిగ, జీడీనెల్లూరు, ఐరాల, పూతలపట్టు, రామచంద్రాపురం, తొట్టంబేడు మండలాల్లో 3 చొప్పున, బి.కొత్తకోట, గుర్రంకొండ, పెద్దపంజాణి, రేణిగుంట, శ్రీరంగరాజపురం, వడమాలపేట, వరదయ్యపాళ్యం, ఏర్పేడు మండలాల్లో 2 వంతున నమోదయ్యాయి.