21 నుంచి అచ్యుతస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-06-18T03:05:06+05:30 IST
: మండలంలోని కుల్లూరులో ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత అచ్యుతస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 21
కలువాయి, జూన్ 17 : మండలంలోని కుల్లూరులో ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత అచ్యుతస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుంచి ఏకాంతంగా ప్రారంభమవుతాయని పెంచలకోన ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ ఉత్సవాలు ఈనెల 27 వరకు జరుగుతాయన్నారు. గురువారం బ్రహ్మోత్సవ ఏర్పాట్లును ఆయనతో కలసి పెంచలకోన ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్య స్వామి, ఈవో, అచ్యుతస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధారాచార్యులు పర్యవేక్షించారు. కొవిడ్ కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు స్వామి వారి దర్శినం రద్దు చేశామని ఆయన తెలిపారు.