గత ఏడాది 2118 బ్యాంకు బ్రాంచిల మూసివేత

ABN , First Publish Date - 2021-05-10T06:36:25+05:30 IST

దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచిలు మూసివేయడం లేదా ఇతర బ్రాంచిల్లో విలీనం చేయడం జరిగింది...

గత  ఏడాది 2118 బ్యాంకు బ్రాంచిల మూసివేత

ఇండోర్‌: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచిలు మూసివేయడం లేదా ఇతర బ్రాంచిల్లో విలీనం చేయడం జరిగింది. నీముచ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ అడిగిన ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలియచేశారు. అత్యధికంగా 1283 బ్రాంచిలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడావి ఉన్నాయి. పీఎస్‌బీ  బ్రాంచీల సంఖ్య తగ్గడం విచారకరమని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి యువత అసహనానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. 


Updated Date - 2021-05-10T06:36:25+05:30 IST