22 గంటల నరకంపై విచారణ

ABN , First Publish Date - 2020-08-11T18:23:17+05:30 IST

ఈ నెల 9న ఆంధ్రజ్యోతిలో వచ్చిన 22 గంటల నరకం కథనానికి స్పందించిన..

22 గంటల నరకంపై విచారణ

నివేదిక సమర్పించిన ఆదోని ఆర్డీవో


కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న ఆంధ్రజ్యోతిలో వచ్చిన 22 గంటల నరకం కథనానికి స్పందించిన కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ ఆదోని ఆర్డీవోను విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తిచేసి ఆర్డీవో నివేదికను సమర్పించారు. దీని ప్రకారం  బాధితుడు  ఆదోని ఏరియా ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి వైద్యు లు పరీక్షించారని, ప్రమాద తీవ్రత ఎక్కువ లేకపోవడంతో హోం ఐసొలేషన్‌కు ఆదేశించారని తెలిపారు. దానికి బాధితుడు కూడా అంగీకరించి, ఆ తర్వాత   వైద్యుల సూచన లేకుండా సొంత నిర్ణయంతోనే కర్నూలు ప్రజా వైద్యశాలకు వెళ్ళారని ఆర్డీవో నివేదికలో తెలిపారు.  


Updated Date - 2020-08-11T18:23:17+05:30 IST