కర్ప్యూ ఉల్లంఘించిన 22 మందిపై కేసులు

ABN , First Publish Date - 2021-05-18T05:18:05+05:30 IST

పట్టణంలో రాత్రి పూట కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక సాకుతో రోడ్ల మీదకు వచ్చిన 22 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐలు కె.రామారావు, డి.రవికుమార్‌ తెలిపారు.

కర్ప్యూ ఉల్లంఘించిన 22 మందిపై కేసులు

15 మోటారు సైకిళ్లు సీజ్‌

తణుకు, మే 17 : పట్టణంలో రాత్రి పూట కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక సాకుతో రోడ్ల మీదకు వచ్చిన 22 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐలు కె.రామారావు, డి.రవికుమార్‌ తెలిపారు. ఈ సం దర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేర కు నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు 15 మోటారు సైకిళ్ళు సీజ్‌ చేశామన్నారు. నిత్యావసర సరుకులు ఆయా గ్రా మాల్లో కొనుగోలు చేసుకోవాలని, అత్యవసరమైతేనే తప్ప తణుకు పట్టణానికి రావద్దని సూచించారు. 

భీమడోలులో ఆరుగురిపై కేసులు 

భీమడోలు, మే 17 : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కర్ఫ్యూకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. కర్ఫ్యూ సమయం ముగిసిన తరువాత దుకాణాలు తెరిచ ఉంచిన ముగ్గురిపైన, నిబంధనలకు విరుద్ధంగా మోటారు సైకిళ్లపై తిరుగుతున్న ముగ్గరిపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:18:05+05:30 IST