22 మందికి నెగెటివ్‌

ABN , First Publish Date - 2020-04-06T10:17:57+05:30 IST

జిల్లాలో మరో 22 మంది కరోనా అనుమానిత వ్యక్తులకు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యింది.

22 మందికి నెగెటివ్‌

మరో 171 మంది అనుమానితుల నివేదికల కోసం  నిరీక్షణ

ఐసోలేషన్‌ వార్డుల్లో 138 మంది


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 22 మంది కరోనా అనుమానిత వ్యక్తులకు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యింది. ఆదివారం వీరికి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నెగిటివ్‌ వచ్చినవారి  సంఖ్య 306కు చేరింది. ఇంకా 171 మందికి సంబంధించిన  ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.


పరీక్షల నిమిత్తం ఆదివారం నమూనాలను పంపించలేదు. కాగా కరోనా కంట్రోల్‌ రూమ్‌కు 22 మంది ఫోన్‌లు చేశారు. ఎక్కువ మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నామని, అంబులెన్స్‌ కావాలంటూ ఫోన్‌ చేశారని, ఫీల్డ్‌ సర్వైలెన్స్‌ బృందానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో 104 మంది, ఈఎన్‌టీ ఆస్పత్రిలో 10 మంది, గీతం ఆస్పత్రిలో 14 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ కేంద్రాల్లో 122 మంది వున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T10:17:57+05:30 IST