జిల్లాలో కొత్తగా 227కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-18T05:39:43+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 227పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రికొత్తగూడెంలో

జిల్లాలో కొత్తగా 227కరోనా పాజిటివ్‌ కేసులు

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమవిభాగం/వైరా, సెప్టెంబరు 17 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 227పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రికొత్తగూడెంలో 150, ఖమ్మం జిల్లాలో 77మంది కొవిడ్‌ బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1156 మందికి పరీక్షలు నిర్వహించగా 150మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో 77మందికి లక్షణాలున్నాయని నిర్ధారణైనట్టు రాష్ట్ర వైద్యాధికారులు తమ బులిటెన్‌లో పేర్కొన్నారు. 


ఒకే ఇంట్లో ఆరుగురికి.. 

వైరాలో గురువారం 19మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. ఈ క్రమంలో మండలంలోని సిరిపురం గ్రామంలో పదిమందికి టెస్టులు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒకే ఇంటికి చెందిన వారు ఆరుగురున్నారు. 

Updated Date - 2020-09-18T05:39:43+05:30 IST