237 కరోనా కేసులు... ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-08-15T05:51:34+05:30 IST
చిత్తూరు జిల్లాలో శుక్ర, శనివారం కొవిడ్ బారినపడి ముగ్గురు మరణించారు.
తిరుపతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 237 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు కొవిడ్ బారిన పడి మరణించారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 234871కి చేరగా మృతుల సంఖ్య 1794కు పెరిగింది. కాగా శనివారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 2550 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్ కేసులు తిరుపతిలో 29, శ్రీకాళహస్తిలో 25, చిత్తూరులో 24, పూతలపట్టులో 17, తిరుపతి రూరల్లో 15, పుత్తూరు, ఏర్పేడు మండలాల్లో 11 వంతున, యాదమరిలో 9, ఐరాల, కురబలకోట మండలాల్లో 8 చొప్పున, మదనపల్లె, జీడీనెల్లూరు మండలాల్లో 6 చొప్పున, పీలేరులో 5, రామచంద్రాపురం, శ్రీరంగరాజపురం, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 4 వంతున, నగరి, గంగవరం, పాకాల, పెనుమూరు, రేణిగుంట, రొంపిచెర్ల, తొట్టంబేడు మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, పలమనేరు, గుడిపాల, కలికిరి, నారాయణవనం, తంబళ్ళపల్లె మండలాల్లో 2 వంతున, బైరెడ్డిపల్లె, బీఎన్ కండ్రిగ, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, కేవీబీపురం, కార్వేటినగరం, కుప్పం, ములకలచెరువు, నాగలాపురం, నిండ్ర, పాలసముద్రం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, పులిచెర్ల, సదుం, తవణంపల్లె, వడమాలపేట, వరదయ్యపాళ్యం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.