అఫ్ఘాన్ ప్రభుత్వ వైమానిక దాడులు
ABN , First Publish Date - 2020-09-21T08:19:11+05:30 IST
తాలిబన్ స్థావరాలు లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం శనివారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది పౌరులు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర కుందుజ్ ప్రావిన్స్లో ఖనాబాద్ జిల్లాలోని సయ్యద్ రమజాన్ గ్రామంలో ఈ దాడులు జరిగాయి...
- 24 మంది పౌరుల మృతి
కాబుల్, సెప్టెంబరు 20: తాలిబన్ స్థావరాలు లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం శనివారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది పౌరులు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర కుందుజ్ ప్రావిన్స్లో ఖనాబాద్ జిల్లాలోని సయ్యద్ రమజాన్ గ్రామంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో చనిపోయిన వారిలో చాలా మంది పౌరులే అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే వైమానిక దాడుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని అఫ్ఘాన్ మంత్రిత్వశాఖ చెప్పుకొంటోంది. పౌరులు చనిపోయారన్న వాదనలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.